ఏపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నేడు టీడీపీ ఆఫీస్ లో తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ రెడ్డి చెప్పుతున్నాడు.. మా వాళ్ళకు బిపి వచ్చి దాడి చేశారు అని... మీ వాళ్ళకు బిపి వస్తే మా అద్దాలు మాత్రమే పగిలాయి.. మాకు బిపి వస్తే మీ వీపులు పగులుతాయ్ అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం ఎప్పుడు సంయమనంతో ఉంది అని ఆయన అన్నారు. పార్టీ కార్యలయం పై దాడి చేసి 70 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు దెబ్బ తీసారు అని అన్నారు.

పార్టీ కార్యలయం మీద దాడి చేసిన ఏ ఒక్కడినీ విడిచిపెట్టం అని ఆయన స్పష్టం చేసారు. ఇప్పటి వరకు ఒక లెక్క...ఇప్పుడు మరో లెక్క...చంద్రబాబు కొడుకు వచ్చాడు జాగ్రత్త అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద మీ మంత్రులు అసభ్యంగా మాట్లాడితే మీకు వినసాంపుగా ఉందా? అని నిలదీశారు. మా వాళ్ళకు బిపి వస్తే మీరు తాడేపల్లి ప్యాలెస్ వదిలి పారిపోయే పరిస్దితి వస్తుంది అని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు పిల్లలకు చదువు చెప్పించి ఉద్యోగాలు ఇస్తే వై.సి.పి యువతకు గంజాయి అలవాటు చేస్తున్నారు అంటూ ఆరోపించారు.

చంద్రబాబును ఒక వైపే చుశారు... ఇకపై మరో వైపు చుస్తారు అని హెచ్చరించారు. కార్యకర్తలారా...మనకు జరిగిన ప్రతి అవమానాన్ని పట్టుదలగా మలుచుకొని పని చేయండి అని సూచించారు. ఈసారి మనకు వైసిపిలా 151 కాదు... 161 రావాలి అని అన్నారు. మనం అధికారంలోకి వచ్చాక వైసిపి నాయకులు దేశం వదిలి పారిపోతారు అని మనకు జరిగిన ప్రతి అవమానానికి బదులు తీర్చుకుందాం అని స్పష్టం చేసారు. ఇంకొకసారి మా నాయకుడి గురించి తప్పుగా మాట్లాడితే గుడ్డలూడదూసి రోడ్డుపై కొడతాం అని హెచ్చరించారు. బాబూగారూ...ఈ సారి మీ మంచితనం మేం వినం సార్ అంటూ జరిగిన ప్రతి అవమానానికి బదులు తీర్చుకుంటాం అని స్పష్టం చేసారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: