హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా సీరియస్ గా ప్రచారం చేయడం మనం చూస్తున్నాం. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణాలో ఈ ఎన్నికలు బాగా హాట్ టాపిక్ అయ్యాయి. కమలాపూర్ మండలం శనిగరంలో ప్రచారం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. శనిగరం,మీ చుట్టు పక్క గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించింది....ఇది అబద్ధమా...శనిగరం చౌరస్తకు టీఆర్ఎస్ నాయకులకు సిద్ధమా అని ఆయన సవాల్ చేసారు.

హుజూరాబాద్ ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర  ప్రజలు ఎదురుచూస్తున్నారు...పేదలంతా మీ వైపు చూస్తున్నారు...కేసీఆర్ కీ మీరు బుద్ధి చెప్తున్నారు అని అన్నారు. ఆర్ ఆర్ ఆర్  సినిమా చూపిస్తాం...ప్రగతిభవన్ కే స్క్రిన్ పెడతాం అని తెలిపారు. మీరు ఆర్ ఆర్ ఆర్  సినిమా చూడలంటే...కేసీఆర్ కీ సినిమా చూపించలంటే కమలంకీ ఓటు వేయాలి అని ఆయన కోరారు. కరోనా వ్యాక్సిన్ మనందరీకీ కేంద్రం ప్రభుత్వం ఇచ్చింది అని అన్నారు. కరోనా సమయంలో కేసీఆర్,కేసీఆర్ ఫ్యామిలీ ఫౌమ్ హౌజ్ లో ఉన్నారు...బీజేపీ నాయకులు సేవ చేశారు అని తెలిపారు.

కరోనా సమయంలో నా ప్రాణలు,నా ఫ్యామిలీ ముఖ్యం కాదు...వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా ప్రజలను కాపాడే భాద్యత నాదే అన్నా వ్యక్తి ఈటల రాజేందర్ అని ఆయన కొనియాడారు. ఎక్కడ ఎన్నికలు వచ్చినా దండుపాళ్యం వస్తాది...27 వరకే వాళ్ళు అని అన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రప్రభుత్వం చేసింది....చేప్పుకునేది టీఆర్ఎస్ వాళ్ళు అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ గల్లంతు అయితాది....ఈటల రాజేందర్ గెలుపు ఖాయం అన్నారు ఆయన. కమలాపూర్ ప్రజలు నియాతిగల్ల ప్రజలు,చైతన్యవంత ప్రజలు నాకు తెలుసు బీజేపీని గెలిపిస్తారు అని పేర్కొన్నారు. రైతుల పోలల్లో ఎ పంట పండించాలే వాళ్ళదే నిర్ణయం...నువ్వు ఎవరూ కేసీఆర్ నిర్ణయించేది అని స్పష్టం చేసారు. దళితబంధుపై మేము లెటర్ రాసి ఆపినట్టు అబధ్ధాపు ప్రచారం చేస్తున్నారు...దమ్ముంటే  రండి భాగ్యలక్ష్మి  టెంపుల్ కీ అక్కడ ప్రమాణం చేద్దాం అని ఆయన డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts