సామాజిక బాధ్యత విస్మరిస్తున్న ప్రతిపక్షాలు:
ఇవాళ దేశవ్యాప్తంగా గాని అనేక రాష్ట్రాలలోనూ విద్యా, వైద్య రంగం పూర్తిగా ప్రైవేటు ఆధీనంలో కొనసాగుతున్నది. ఢిల్లీ కేరళ వంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ప్రభుత్వ రంగంలో కొనసాగుతూ నాణ్యమైన విద్య వైద్యం అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అలాంటి విధానాన్ని అమలు చేయడానికి ప్రతిపక్షాలు ఎందుకు పార్లమెంట్లో నిలదీయడం లేదు..?. భారతదేశంలో కేవలం గుజరాత్ లో మాత్రమే మద్యపానం నిషేధించబడినది. పొరుగు రాష్ట్రాల్లో అమల్లో లేదు కనుక అక్రమ రవాణా తో నిషేధము విఫలమవుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని యువశక్తిని పట్టించుకున్నట్లు అయితే ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధానికి ఉద్యమించాలి .ఏనాడైనా ఆలోచించారా..? కల్తీ మందులు, అశ్లీల టీవీ సీరియల్స్ సినిమా సెల్ ఫోన్ నీలి చిత్రాలు, ఆహార పదార్థాలలో కల్తీ, రాజకీయ ఉద్యోగిస్వామ్యం లో విపరీతమైన అవినీతి,
వివక్షత ,అసమానతలు, అంతరాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? 73 శాతం సంపద కేవలం ఒక శాతంగా ఉన్న సంపన్నవర్గాల చేతిలో ఉంటే ఈ దేశంలో సామ్యవాద తరహా ప్రభుత్వం అని రాజ్యాంగంలో రాసుకుంటే సరిపోతుందా?
20 శాతం దారిద్ర్య రేఖ దిగువన ఉంటే మరో 20 శాతం సంచార వలస కార్మికులు ఈ దేశంలో అష్ట కష్టాలు పడుతుంటే ప్రజల సమస్యలు పట్టించుకోని రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు తమ పబ్బం గడుపు కోవడా నికి ఉనికి కోసం మాత్రమే కొనసాగితే ప్రయోజనం ఏమీ లేదు.