ప .గో జిల్లా : బీజేపీ పార్టీ పై తిరు పతి మాజీ ఎంపీ చింతా మో హన్ షాకిం గ్‌ కామెం ట్స్ చేశారు.  భారత దేశం ప్రమాదం అంచుల్లో ఉందని... భారత దేశ భూ భాగం లోకి చైనా చొచ్చుకు వస్తున్నా దేశ ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని ఫైర్‌ అయ్యారు చింతా మోహన్‌.  ప్రధాని అత్యంత ఆప్తుడి పోర్టులో 20 కోట్ల విలువ చేసే హెరాయిన్ దొరికితే అతన్ని అరెస్టు చేయ లేదని నిప్పులు చెరిగారు చింతా మోహన్‌.  కాంగ్రెస్ ప్రభుత్వంలో లీటర్ డీజిల్ పై 50 రూ.లు ఉంటే.. బిజెపి ప్రభుత్వంలో 100 రూ.లు దాటి పోయిందని మండి పడ్డారు.  

దేశంలో అభివృద్ధి శూన్యం, దేశం అప్పుల్లో కూరుకు పోయిందని... దేశంలో ప్రజలు ఆకలి కేకలు పెడుతూ ఉన్నారని ఫైర్‌ అయ్యారు చింతా మోహన్‌.  ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఇంకా అద్వానంగా మారాయని...  పట్టాభి ముఖ్యమంత్రిని అనటం సబబు కాదని చురకలు అంటించారు చింతా మోహన్‌.  దాన్ని సమర్థించడం చంద్రబాబు పొరపాటని..  ఫైర్‌ అయ్యారు చింతా మోహన్‌. దీక్ష చేయడం ఎందుకు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేసాడు రాష్ట్రానికి అంటూ ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి పీఠంపై ఇంకా అతని ఆశ తగ్గలేదన్నారు.

అమిత్ షా మిమ్మల్ని ఆదరించడు, ఎందుకు వెళ్లటం అవసరమా అని నిలదీశారు చింతా మోహన్‌. ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవటానికి రెండు సంవత్సరాల నుంచి మీరు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని ఫైర్‌ అయ్యారు చింతా మోహన్‌. ఈ డబ్బం తా సీఎం జ గన్ ఎక్కడికి తరలిస్తున్నారని ఆగ్రహించారు చింతా మోహన్‌. వచ్చే ఎన్నికల్లో భారత దేశంలో మరియు ఆంద్ర ప్రధేశ్‌ రాష్ట్రం లో కాంగ్రెస్‌ పార్టీ అధికా రం లోకి వస్తుందని స్పష్టం చేశారు చింతా మోహన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: