నిన్నటి వేళ భారత్ పాక్ మ్యాచ్ ను చాలా మంది దాయాదుల పోరు అని రాశారు. అది తప్పు. దేశాల మధ్య జరుగుతున్నది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్. అది ఓ యుద్ధం కాదు. ముందు అది గుర్తు పెట్టుకోవాలి. పాక్ మన నుంచి విడిపోయిన దేశం. కొన్ని సంస్కృతులు ఇప్పటికీ మన కన్నా బాగా ఆదరించే ప్రాంతాలున్నాయి అక్కడ. ఒకదేశం మరో దేశంతో తలపడే సందర్భంలో పాత కోపాలు ప్రదర్శించడం అస్సలు సబబు కాదు. టీం ఇండియా తరఫున మంచి మద్దతు ఇవ్వడంలో ఏ తప్పూ లేదు కానీ మరో దేశాన్ని అదే పనిగా తిట్టడం సరికాదు. దౌత్య బంధాలు బలోపేతం చేసే దిశగానే ఇరు వర్గాలూ ఇప్పటికీ ఎప్పటికీ సఖ్యతతోనే ఉండాలి. ఉంటాయి కూడా!
ఇక టీం ఇండియా ఎన్నో ఘన విజయాలు అందుకుంది. మన కన్నా పాకిస్తాన్ ఆటగాళ్లు బాగా ఆడారని కూడా నిన్న రుజువైంది. ఇంకేం ఈ ఒక్క ఓటమితో టీం ఇండియా పరువేం పోదు కానీ హాయిగా మరో ఆటకు సిద్ధం కండి కోహ్లీ. ఈ వేళ మీ ఓటమిలోనూ మీ గెలుపులోనూ ఈ దేశానికి చెందిన ఎందరో అభిమానులు ఉన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇవాళ మీకు మంచి స్పందన వస్తోంది. ఏం కాదు బాగా కృషి చేయండి. ఈ సందర్భంగా మీడియా కూడా దాయాదుల పోరు అన్న మాటను విరమించుకుంటే మేలు.