జగన్ గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. అందుకే ఆయన చంద్రబాబు విమర్శలను అస్సలు పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ అంటే జగన్ కు ముందు నుంచి కూడా పిచ్చ లైట్. అసలు పవన్ వైపు కూడా చూడరు. అయితే ఇప్పుడు జగన్ కు, వైఎస్ ఫ్యామిలీకి అభిమానులుగా ఉన్న వారు కూడా జగన్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఉండవల్లి లాంటి వారు జగన్ ప్రభుత్వాన్ని ఇటీవల కాలంలో ఏకి పారేస్తున్నారు.
ఇక నిన్నటి వరకు వైసీపీ లోనే ఉన్న మరో సీనియర్ నేత, మా జీ మంత్రి డీఎల్. రవీంద్రా రెడ్డి లాంటి వాళ్లు సైతం ఇప్పుడు జగన్ వ్యతిరేక గళం విప్పారు. డీఎల్ అవుట్ డేటెడ్ అని విమర్శలు వస్తున్నా.. ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత.. పైగా జగన్ సొంత జిల్లాకు చెందిన లీడర్. అది అక్కడ ఎఫెక్ట్ చూపుతోంది. ఇక వైఎస్ ఆత్మ గా చెప్పుకునే మాజీ రాజ్యసభ సభ్యుడు కెవీపీ రామ చంద్ర రావు సైతం జగన్ కు వ్యతిరేకంగా తెర చాటుగా చాలా ప్లాన్లే వేస్తున్నట్టు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మరి కొందరు నేతలు సైతం జగన్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. జగన్ వీరిపై ఓ కన్నేసి ఉంచకపోతే కొంప కొల్లేరు అయ్యేలా ఉంది.