ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ హాట్ టాపిక్‌గా మారారు. చంద్ర‌బాబు, లోకేష్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన వంశీ కొన్ని అభ్యంత‌ర‌క‌ర ప‌దాలు కూడా వాడారు. లోకేష్‌కు మాధ‌వ‌రెడ్డి పోలిక‌లు ఎలా ? వ‌చ్చాయి ?  మాధ‌వ‌రెడ్డి ఎందుకు చ‌నిపోయాడో ?  లోకేష్ చంద్రబాబును అడిగి తెలుసుకోవాల‌ని మాట్లాడారు. తాను గ‌న్న‌వ‌రంలో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని లోకేష్ కు గాని, చంద్ర‌బాబు కు కాని దమ్ముంటే వ‌చ్చి త‌న‌పై పోటీ చేసి గెల‌వాల‌ని స‌వాళ్లు రువ్వారు.

ఆ త‌ర్వాత టీడీపీ నేత‌లు కూడా వంశీని గ‌ట్టిగానే టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.. వంశీని పశువుల డాక్టర్ అనుకున్నాం.. కానీ..పశువు కంటే హీనమైనోడు అని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఇప్పుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ వంశీ గురించి కొన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టారు. వంశీ సినిమా ఇండ‌స్ట్రీలో ప‌క్క‌లు వేసి తార్చే వ్య‌క్తి అని విమ‌ర్శించారు.

అంతే కాకుండా జూనియ‌ర్ ఎన్టీ ఆర్ తో గ‌తంలో సినిమాలు తీసిన వంశీ ఓ భూమి విష‌యంలో ఏకంగా ఎన్టీఆర్ నే మోసం చేశాడ‌ని సంచ‌ల‌న విష‌యం చెప్పారు. అయితే పైకి మాత్రం వంశీ ఎన్టీఆర్ తో పాటు ఆయ‌న కుటుంబం విష‌యంలో ఎంతో ప్రేమ‌తో ఉన్న‌ట్టు న‌టిస్తాడ‌ని .. అలాగే ప‌రిటాల ర‌విని కూడా వంశీ మోసం చేసింది నిజం కాదా ?  దీనికి ఆయ‌న స‌మాధానం చెప్పాల‌ని మ‌ద్దిప‌ట్ల డిమాండ్ చేశారు.

ర‌వి హ‌త్య త‌ర్వాత వంశీ ర‌వి కి చెందిన భూముల ప‌త్రాలు కూడా తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మాట వాస్త‌వం కాదా ? అని సూర్య‌ప్ర‌కాష్ నిప్పులు చెరిగారు. ఇక టీచర్ కొడుకు ను అని చెప్పుకునే వంశీ నేడు.. వందల వేల కోట్ల రూపాయల‌కు ఎలా ? అధిప‌తి అయ్యాడో తానే చెప్పాలని ఆయ‌న ప్ర‌శ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: