ఉద్యమాల వేళ కేసీఆర్ ఆంధ్రా పాలకులను తిట్టారు. ఆంధ్రా ప్రజలను కాదు. ఆయనకు సామాన్యుడైన శ్రీకాకుళం వాసి అంటే ఇష్టమే! మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఎదిగిన ప్రతి వ్యక్తి అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆ విషయంలో డైలమాకు తావే లేదు. ఆయన కోపం శ్రీకాకుళం మీదో ఉత్తరాంధ్ర మీదో కాదు. ఆ మాటకు వస్తే రాయలసీమ అన్నా ఆయనకు ప్రేమే. నీళ్ల విషయమై ఆయన పట్టుబడతాడు. ఆ స్థాయిలో పోరు సాగించాల్సింది ఎవరు? ఆంధ్రా పాలకులే కదా కానీ ఆ పని వాళ్లు చేయకుండా రాజకీయాలు మాట్లాడతారు. ఇక్కడే కేసీఆర్ కు కోపం తన్నుకు వస్తుంది. మాట్లాడుకుంటే పోయే వాటికి ఢిల్లీ దాకా
లాగడం ఎందుకు అని కూడా ప్రశ్నిస్తారు. ఏదేమైనా కొన్ని విషయాలలో కేసీఆర్ సమర్థంగా పనిచేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రా పాలకుల కన్నా కొన్ని విషయాల్లో పరిణితి ఉన్న నేత. తప్పిదాలు ఉన్నా కూడా మారుమూల ప్రాంతాలలో కూడా ఆయనకు ఇవాళ అభిమానులు ఉన్నారు అన్నది వాస్తవం.