గడిచిన 24 గంటల్లో కొత్తగా 8538 కేసులు నమోదు కాగా, వారిలో 75 మంది ప్రాణాలను కోల్పోయారు. కరోనా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఉదృతి కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డిసెంబర్ వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా తక్కువగా ఉందని కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఆ నిర్లక్ష్యమే కరోనాకి మళ్ళీ ఆజ్యం పోస్తుందని అంటున్నారు. ప్రమాదం ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేకుండా అందరూ మాస్క్ లు , శానిటైజర్ లు తప్పక వాడుతూ జాగ్రత్తలు వహించాలని అంటున్నారు.
జనవరి లో థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. అందుకే డిసెంబర్ దాటితే కానీ కరోనా పరిస్థితి ఏమిటా అని అంచనాకు రాలేమని వారు అంటున్నారు. కాబట్టి అందరూ ఇంకా కొంత కాలం తప్పకుండా కరోనా నియమాలను పాటిస్తూ జాగ్రత్త వహించడం తప్పదంటున్నారు. ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే కొందరు ఒక డోసు తీసుకుని మనం ఇక సేఫ్ అని అనుకుంటున్నారు. రెండు డోసు వద్దులే అని లైట్ తీసుకుంటున్నారు కానీ నిపుణులు మాత్రం రెండో డోసు తీసుకుని బూస్టర్ డోసు కూడా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.