వచ్చే ఎన్నికల్లో భూమన తాను పోటీ నుంచి తప్పుకుని తన వారసుడిని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా భూమన వారసుడు సత్తా చాటాడు. ఇక వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే సీటు తన వారసుడికి ఇవ్వాలని కూడా జగన్ దగ్గర కరుణా కర్ ప్రస్తావించారట. అయితే అందుకు జగన్ నో చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన + టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం ఉంది.
అదే జరిగితే తిరుపతిలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువుగా ఉండడంతో ఈ సారి ఇక్కడ వైసీపీ నుంచి కూడా కాపు వర్గానికే చెందిన వ్యక్తిని రంగంలోకి దింపాలన్నదే జగన్ ప్లాన్ అట. ఇక గతంలో కూడా ఇక్కడ నుంచి ఆ సామాజిక వర్గానికే చెందిన మెగాస్టార్ చిరంజీవి, చదలవాడ కృష్ణమూర్తి, వెంకటరమణ, సుగుణమ్మ గెలిచారు.
అందుకే ఈ సారి జనసేన + టీడీపీ కలిసి పోటీ చేసినా క్యాస్ట్ ఈక్వేషన్ తేడా రాకుండా ఉండేందుకే ఇక్కడ కరుణా కర్ను పక్కన పెట్టేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు టాక్ ? కరుణా కర్ను పక్కన పెడితే ఆయనకు ఈ సారి ఎమ్మెల్సీ ఇస్తారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.