మనం చేసిన ఆవిష్కరణ ఈ దేశంలో ఎక్కడా  లేదని, ఏ రాష్ట్రంలో కూడా లేదని, కనీసం ఆలోచన కూడా లేదనిసీఎం కేసీఆర్ అన్నారు. మనిషి చనిపోతే సొంత స్థలం ఉన్న వారి పరిస్థితి వేరు, స్థలం లేని వారు ఎక్కడ దహన సంస్కారాలు చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఈరోజు తెలంగాణలో 12709 గ్రామపంచాయతీలు ఉంటే అన్ని గ్రామాల్లో అద్భుతమైన పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు, ప్రతి ఇంటికి ప్రతి రోజు నిరంతరంగా వచ్చే కృష్ణ, గోదావరి జలాలు మిషన్ భగీరథ. అద్భుతంగా పొంగిపొర్లుతున్న చెక్ డాం లు  నెలల తరబడి ఆగకుండా మత్తడి పోస్తున్నటువంటి మన చెరువులు, మన కాకతీయ రాజులు నిర్మించిన ఇచ్చినటువంటి చెరువులు.

ఈ దృశ్యం మళ్లీ చూస్తామా అని మనం భయపడే వాళ్ళమని మన సీఎం కేసీఆర్ అన్నారు. సమైక్య రాష్ట్రం లో ఉన్నప్పుడు ఒక రూపాయి కూడా మైనర్ ఇరిగేషన్ కు రాని పరిస్థితి. శాసనసభ్యుడిగా నేనే స్వయంగా గమనించిన పరిస్థితి అని ఆయన అన్నారు. మిషన్ కాకతీయ పుణ్యమాని  ఇంత భారీ వర్షాలు గత సంవత్సరం, ఈ సంవత్సరం కురిసిన ఎక్కడా ఏ జిల్లా లో కూడా ఒక చెరువు కూడా తెగిపో లేదు. అది మిషన్ కాకతీయ ఫలితం.మన శాసన సభ్యులు అవలంభించిన విధానం. ప్రభుత్వం కార్యక్రమం ఇస్తే మన శాసన సభ్యులు అంతా రాత్రింబవళ్ళు కార్య క్షేత్రాల్లో, తమ నియోజకవర్గాల్లో నిబద్ధత సాదించిన కృషి అని ఆయన అన్నారు. పరిశ్రమ రంగాల్లో వెల్లువలా వస్తున్న పెట్టుబడులు, ఐటీ రంగంలో దూసుకుపోతున్న మన ఖ్యాతి, 57 వేల కోట్ల ఎగుమతుల నుంచి లక్షా యాభైవేల కోట్ల వరకు టచ్ అయిపోతున్న టువంటి ఐటీ ఎగుమతులు.

 దేశ విదేశాల్లో మన గురించి మాట్లాడుతున్నటువంటి కీర్తిప్రతిష్టలు. ఈ రంగం ఆ రంగం కాదు, ఈ కులం ఆ కులం కాదు తెలంగాణ సమాజ అభివృద్దే మన మతం. తెలంగాణ ప్రజల ముఖాల మీద చిరునవ్వే మన అభిమతం. కులము,మతము అనే చిన్న చిన్న ఇరుకైన అటువంటి భావన లేకుండా అందర్నీ కడుపులో పెట్టుకొని సాగాలనే అద్భుతమైన ప్రస్థానమే ఈరోజు అంతటా కనిపిస్తుందన్నటువంటి విశ్వాసం, ధీమా అని సీఎం కేసీఆర్ వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: