అమిత్ షా మూడు రోజుల జమ్మూ కాశ్మీర్ పర్యటనకు చివరి రోజు అయిన సోమవారం శ్రీనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్షా మాట్లాడారు. కొందరు నాయకులు నన్ను నిందించారని అమిత్ షా పేర్కొన్నారు. నేను మీతో ముక్తసరిగా మాట్లాడాలని అనుకుంటున్నాను. అందుకే బుల్లెట్ప్రూఫ్ షీల్డ్ లేదా భద్రత అవసరం లేదని, ఫరూక్ సాహబ్ పాకిస్తాన్తో మాట్లాడమని సూచించారు. అయితే నేను మాట్లాడుతాను పాకిస్తాన్తో కాదు లోయలోని ప్రజలతో మాట్లాడుతానని తనదైన శైలిలో సమాధానం చెప్పారు అమిత్ షా.
మీ చేతుల్లో రాళ్లు పట్టుకోండని చెప్పినవారు మీకు ఏమి మంచి చేశారో చెప్పాలని యువతను ఆయన ప్రశ్నించారు. లోయలోని యువతను కొందరు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పీఓకే మీ దగ్గర ఉంది. మీ దగ్గర ఇప్పుడు ఆయుధాలు, రాళ్లు ఉన్నాయి. మీ గ్రామాలకు విద్యుత్ ఉందా..? ఆసుపత్రి ఉందా..? మెడికల్ కాలేజీ ఉందా..? కనీసం తాగేందుకు మంచి నీరు ఉందా..? మహిళలకు మరుగుదొడ్లు ఉన్నాయా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆగస్టు 5న ఇంటర్నెట్ బంద్ చేయకుంటే యువతను రెచ్చగొట్టి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేలా చేసేవారని, కాశ్మీర్ ప్రజలు ఇక భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని మోడీ గుండెల్లో కాశ్మీర్ ఉందని.. అందుకే ఇక్కడ అభివృద్ధికి విఘాతం కలిగించే వారు విజయం సాధించలేరుని పేర్కొన్నారు.