అయితే ఇక్కడ బీజేపీ సెకండ్ ప్లేసులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు అయినా తెచ్చేందుకు మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి ఎంతో కష్టపడుతున్నారు. అసలు బద్వేలు ఉప ఎన్నికల్లో పార్టీ ని ముందుండి నడిపించే బాధ్య తలను కూడా ఆ పార్టీ అధిష్టానం ఆది నారాయణ రెడ్డి మీదే పెట్టింది. ఆయన టీడీపీ పాత పరిచయాలతో ఆ ఓట్లను కొంత వరకు అయినా బీజేపీకి టర్న్ చేసే బాధ్యతలను తీసుకున్నారు.
టీడీపీలో మండలా ల వారీగా ఉన్న దిగువ స్థాయి నేతలను పిలిపిం చుకుని వారికి తులమో పలమో ఇస్తూ వారిని ఈ ఎన్నిక వరకు బీజేపీకి చేయమని అడుగుతున్నారట. దీనిపై స్థానికంగా పెద్ద ప్రచారమే జరుగుతోంది. ఇంత జరుగుతున్నా టీడీపీ జిల్లా నాయకత్వం కాని.. రాష్ట్ర నాయకత్వం కాని పట్టించు కోవడం లేదు. పోలయిన ఓట్లలో కనీసం ఇరవై శాతం ఓట్లను సాధించాలని ఆది నారాయణ టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి ఆది టార్గెట్ ఎంత వరకు నెర వేరుతుందో ? చూడాలి.