ఇక ఇక్కడ పోటీ వైసీపీ వర్సెస్ బీజేపీ మధ్యే ఉంటుందని అంటున్నారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో రైల్వే కోడూరు లో పోటీ చేసి ఓడిపోయిన సురేష్ ఈ సారి బద్వేలులో పోటీ చేస్తున్నారు. రెండు పార్టీలో ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇక ఈ నియోజకవర్గం లో మొత్తం 281 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య కు ఏకంగా 44 వేల ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది.
ఇక ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో 148 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పో లింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఉప ఎన్నిక కోసం 15 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ బలగాలు దిగాయి. వీటితో పాటు అదనపు బలగాలే కాకుండా 2 వేల మందితో పోలీసు బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ విధులకు 1124 మంది సిబ్బంది పని చేయనున్నారు.
ఇక నియోజకవర్గం లో మొత్తం 2.12,730 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,06,650 కాగా... మహిళలు1,06,069 మంది, ఇతరులు 20 మంది ఉన్నారు. ఇక ఈ నెల 30న పోలింగ్ జరుగుతుండగా.. ఉప ఎన్నిక కౌంటింగ్ వచ్చే నెల 2వ తేదీన జరుగుతుంది.