ప్రస్తుతం బద్వేల్ లో ఉన్న పరిస్థితి చూస్తే మొట్ట మొదటి సారి టీడీపీ మంచి పని చేసిందని అందరూ అనుకుంటున్నారు. ఏంటి... ఇలా అంటున్నారు అని కంగారు పడకండి. అసలు విషయం ఏమిటో తెలిస్తే మీరు కూడా అవుననే అంటారు. అక్టోబర్ 30 వ తేదీన బద్వేల్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా వైసీపీ, బీజేపీ మరియు కాంగ్రెస్ లు పోటీ పడ్డాయి. అయితే అనూహ్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలో మేము పోటీ చేసేది లేదని నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ షాక్ అయ్యారు. 

ఏంటి ఎంతో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర మరియు నాయకుడు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికలో పోటీ చేయకపోవడమా? అంటూ ముక్కున వేలేసుకున్నారు. కానీ ఆ రోజు బాబోరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారా అని, కొన్ని విషయాలను ఊహించడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా, బహుశా టీడీపీకి కొద్ది ఓట్లు కూడా రావని అనుకుని ఉంటారు అందుకే ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ రోజు కాసేపట్లో రాబోయే ఫలితం బట్టి చూస్తే అది రుజువు కానుంది. బీజేపీ మరియు కాంగ్రెస్ లు సైతం వైసీపీ దెబ్బకు గిలగిల కొట్టుకుంటున్నాయి. ఒకవేల టీడీపీ పోటీ చేసుంటే వారికి ఇదే గతి పట్టుండేది. చంద్రబాబు చాలా తెలివిగా తప్పించుకున్నారు. 

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీ రిజల్ట్స్ అనంతరం అనే అవకాశాలు ఉన్నాయి. ఎటు తిరిగి చంద్రబాబును టార్గెట్ చేసే విధంగా వ్యాఖ్యలు ఉంటాయని తెలుస్తోంది. ఇక్కడా వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇక అఫిషియల్ గా ప్రకటించడమే మిగిలింది. అయితే మాములుగా వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి అదీ కాకుండా బద్వేల్ వారికి సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం కాబట్టి పట్టు ఉంటుందని ఈ విజయాన్ని వేరే కోణంలోకి తిప్పే టీడీపీ నాయకులు లేకపోలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: