పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.   ఈ రోజు కేంద్ర ప్రభుత్వం  లీటర్ పెట్రోలు పైన రూ. 5లు, డీజిల్ పైన రూ. 10 లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గి స్తూ నిర్ణయం తీసు కున్నందుకు  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  గారికి బీజేపీ తెలంగాణ శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్‌.   ఈ నిర్ణయం ద్వారా కేంద్రానికి రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం తగ్గుతోందని స్పష్టం చేశారు బండి సంజయ్‌.  

అయినప్పటికీ ప్రజలపై పడిన భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ సాహసోపేత నిర్ణయం తీసు కోవడం అభినందనీయమన్నారు బండి సంజయ్‌.  కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్పూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్రోలు పైన 10 శాతం, డీజి ల్ పై 10 శాతం వ్యాట్ తగ్గించాలని బీజేపీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు బండి సంజయ్‌.  

నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా బీజేపీ పై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని.. కరోనా కష్ట కాలంలో దేశ ఆర్దిక పరిస్థితిని చక్క పె ట్టడం లో మోదీ ప్రభుత్వం విజయం సాధించిన నేపథ్యంలో ఈ  నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు బండి సంజయ్‌.  తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు సంక్షేమాన్ని ద్రుష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోలు, డీజిల్ పై  పన్నులు తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తోందని తెలిపారు బండి సంజయ్‌.  వాహన దారులకు ఊరట కలిగేలా కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకోవాలని డిమాం డ్‌ చే శారు బండి సంజయ్‌.  దీని పై కేసీఆర్‌ సర్కార్‌ త్వ ర గా నిర్ణ  యం తీసు కుంటే నే మంచిదన్నారు బండి సంజయ్‌.  


మరింత సమాచారం తెలుసుకోండి: