తిరుపతి, తిరుమల మధ్య రాకపోకలు సాగించేందుకు వంద ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులను హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ నుంచి కొనుగోలు చేస్తోంది ఆర్టీసీ. మొత్తం 140 కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్ట్ను ఒలెక్ట్రా గ్ర్రీన్ టెక్ సంస్థ దక్కించుకుంది. ఏడాది కాలంలో మొత్తం వంద బస్సులను ఒలెక్ట్రా సంస్థ ఆర్టీసికి అప్పగించనుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్... ఫేమ్-2 ఫథకం కింద ఈ కాంట్రాక్ట్ను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థకు ఆర్టీసీ అప్పగించింది. ఈ ఒప్పందం కారణంగా ఆర్టీసీ దగ్గర మొత్తం 14 వందల 50 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు చేరినట్లుగా ఉంది. మొత్తం వంద బస్సులను కూడా తిరుపతిలోని అలిపిరి డిపోనకు అందిస్తోంది ఏపీఎస్ ఆర్టీసీ. ఒప్పందంలో భాగంగా ఏడాది కాలం పాటు ఈ బస్సుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత కూడా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థదే. ఈ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
తిరుపతి, తిరుమల మధ్య రాకపోకలు సాగించేందుకు వంద ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులను హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ నుంచి కొనుగోలు చేస్తోంది ఆర్టీసీ. మొత్తం 140 కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్ట్ను ఒలెక్ట్రా గ్ర్రీన్ టెక్ సంస్థ దక్కించుకుంది. ఏడాది కాలంలో మొత్తం వంద బస్సులను ఒలెక్ట్రా సంస్థ ఆర్టీసికి అప్పగించనుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్... ఫేమ్-2 ఫథకం కింద ఈ కాంట్రాక్ట్ను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థకు ఆర్టీసీ అప్పగించింది. ఈ ఒప్పందం కారణంగా ఆర్టీసీ దగ్గర మొత్తం 14 వందల 50 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు చేరినట్లుగా ఉంది. మొత్తం వంద బస్సులను కూడా తిరుపతిలోని అలిపిరి డిపోనకు అందిస్తోంది ఏపీఎస్ ఆర్టీసీ. ఒప్పందంలో భాగంగా ఏడాది కాలం పాటు ఈ బస్సుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత కూడా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థదే. ఈ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.