ఏపీలో కమ్మ వర్గం అంటే...అందరికీ టీడీపీనే గుర్తొస్తుంది. ఎందుకంటే టీడీపీలోనే కమ్మ నేతలు ఎక్కువగా ఉంటారు. అటు వైసీపీలో రెడ్డి వర్గం హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే వైసీపీలో కూడా కమ్మ నేతలు బాగానే ఉన్నారు. కానీ వారు ఎక్కువగా హైలైట్ అవ్వరు. ఏదో కొడాలి నాని లాంటి వారు తప్ప. ఇక వైసీపీలో కనబడకుండా జగన్ కోసం కష్టపడుతున్న కమ్మ నేతలు చాలామంది ఉన్నారు.

అయితే అలాంటి కమ్మ నేతలకు జగన్...బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. వైసీపీలో ఉన్న పలువురు కమ్మ నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక ఇవి గాకుండా స్థానిక సంస్థల కోటాలో ఖాళీలు ఉన్న స్థానాలని కూడా భర్తీ చేయడానికి జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ కోటాలో కొందరు కమ్మ నేతలకు పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం.

ముఖ్యంగా మొదట నుంచి తనకు అండగా ఉంటూ, తనతో సన్నిహితంగా ఉండే తలశిల రఘురామ్‌కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రఘురామ్..జగన్ ప్రతి కార్యక్రమానికి పర్యవేక్షకుడుగా పనిచేస్తున్నారు. ఇక మొదట నుంచి జగన్ కోసం పనిచేస్తున్న మరో కమ్మ నేత మర్రి రాజశేఖర్‌కు కూడా ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈయన సీటు కూడా వదులుకున్నారు. చిలకలూరిపేట సీటులో పోటీ చేయాల్సిన మర్రి...జగన్ ఆదేశాలతో సైడ్ అయ్యారు. ఆ సీటులో వైసీపీ తరుపున పోటీ చేసిన విడదల రజిని గెలుపు కోసం కష్టపడ్డారు.

ఇక రజిని గెలిచాక..మర్రికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పైగా ఆయనకు ఎలాంటి పదవి లేదు. ఈ క్రమంలోనే మర్రికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. మొత్తానికి ఇద్దరు కమ్మ నేతలకు జగన్ ఎమ్మెల్సీ ఫిక్స్ చేసేలా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: