ఆఫ్ఘానిస్థాన్పై పాకిస్తాన్, చైనా ప్రభావం తగ్గేలా... భారతదేశం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆఫ్ఘాన్ పొరుగు దేశాలతో పాటు రష్యా, ఇరాన్ వంటి దేశాలతో కలిపి జాతీయ భద్రాత సలహాదారుల సమావేశం నిర్వహిస్తోంది ఇండియా. ఈ సమావేశానికి భారత్ ఆతిధ్యమిస్తోంది. రష్యా, ఇరాన్తో పాటు, ఆసియాలోని పలు కీలక దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయా దేశాలకు ఆహ్వానాలు పంపింది భారత విదేశాంగ శాఖ. అయితే భారత్ ఆతిధ్యమిస్తున్న ఈ సమావేశానికి హాజరు కావడం లేదని పాకిస్తాన్, చైనా దేశాలు తేల్చి చెప్పాయి. ఈ విషయాన్ని ఆయా దేశాలు లేఖల ద్వారా వెల్లడించాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఢిల్లీలో జరిగే ఎన్ఎస్ఏల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న భద్రతా సవాళ్లను ఎదుర్కొవడం, ఆఫ్ఘానిస్థాన్లో శాంతి భద్రతల పరిరక్షణ, సరిహద్దు వివాదాలపై తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఆఫ్ఘానిస్థాన్పై పాకిస్తాన్, చైనా ప్రభావం తగ్గేలా... భారతదేశం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆఫ్ఘాన్ పొరుగు దేశాలతో పాటు రష్యా, ఇరాన్ వంటి దేశాలతో కలిపి జాతీయ భద్రాత సలహాదారుల సమావేశం నిర్వహిస్తోంది ఇండియా. ఈ సమావేశానికి భారత్ ఆతిధ్యమిస్తోంది. రష్యా, ఇరాన్తో పాటు, ఆసియాలోని పలు కీలక దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయా దేశాలకు ఆహ్వానాలు పంపింది భారత విదేశాంగ శాఖ. అయితే భారత్ ఆతిధ్యమిస్తున్న ఈ సమావేశానికి హాజరు కావడం లేదని పాకిస్తాన్, చైనా దేశాలు తేల్చి చెప్పాయి. ఈ విషయాన్ని ఆయా దేశాలు లేఖల ద్వారా వెల్లడించాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఢిల్లీలో జరిగే ఎన్ఎస్ఏల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న భద్రతా సవాళ్లను ఎదుర్కొవడం, ఆఫ్ఘానిస్థాన్లో శాంతి భద్రతల పరిరక్షణ, సరిహద్దు వివాదాలపై తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.