ముఖ్యంగా జగన్...కమ్మ వర్గానికి కూడా పెద్ద పీఠ వేస్తూ వస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కమ్మ వర్గంపై కక్ష సాధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆఖరికి పవన్ కల్యాణ్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఒక కులాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని మాట్లాడారు. అయితే అదే కమ్మ వర్గానికి చెందిన కొడాలి నాని ఏ విధంగా జగన్కు సపోర్ట్గా ఉంటారో అందరికీ తెలిసిందే.
అలాగే వైసీపీలో కమ్మ ప్రజాప్రతినిధులు ఎక్కువగానే ఉన్నారు. మిగిలిన నేతలకు కూడా బాగానే ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా కమ్మ వర్గానికి చెందిన తన స్నేహితుడు తలశిల రఘురామ్కు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. అసెంబ్లీలోనే తలశిల తన ఫ్రెండ్ అని జగన్ చెప్పిన విషయం తెలిసిందే.
తలశిల మొదట నుంచి జగన్కు అండగా ఉంటూ వస్తున్నారు. పైకి ఎప్పుడు కనబడకపోయినా, తెరవెనుక ఉండి పార్టీ కోసం కష్టపడుతుంటారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్తగా ఉంటూ, జగన్ పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని దగ్గర ఉండి చూసుకుంటారు. గతంలో పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. అలా జగన్కు సపోర్ట్గా ఉండే తలశిలకు ఎమ్మెల్సీ దక్కనుందని తెలుస్తోంది. ఈయనతో పాటు కమ్మ వర్గంలో ఉన్న సీనియర్ నేత మర్రి రాజశేఖర్కు కూడా ఎమ్మెల్సీ పదవి దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.