తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రం లో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వాల్సిందేనని... సీఎం కేసీఆర్ ను సరైన టైమ్ లో టచ్ చేసి తీరుతామని హెచ్చరించారు బండి సంజయ్. దళిత బంధు అమలను చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని.... దళితులకు పది లక్షలు ఇవ్వకుంటే కేసీఆర్ వీపు మోత తప్పదని వార్నింగ్ ఇచ్చాడు బండి సంజయ్. దళితులు ఓట్లు వేయకుంటే రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వాడా ? అని నిలదీశారు బండి సంజయ్.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బూతు మాటలు విని తెలంగాణ సమాజం తల దించుకుంటోందని ఆగ్రహించారు బండి సంజయ్. పేదల కోసం కేసీఆర్ తో తల నరుక్కోవటానికి నేను సిద్ధం.. కేసీఆర్ సిద్ధమా ? అని సవాల్ విసిరారు బండి సంజయ్. కేసీఆర్ అవి నీ తి, కుటుం బ పాల నను తరిమి కొట్టటానికి కంకణం కట్టుకున్నానని స్పష్టం చేశారు బండి సంజయ్. అంబేడ్కర్ విగ్రహం ఎప్పుడు ఏర్పాటు చేస్తు న్నాడో చెప్పా లని డిమాండ్ చేశారు బండి సంజయ్. తెలంగాణ లో ముఖ్యమంత్రి కి అర్హులైన దళితులే లేరా ? అని నిలదీశారు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్.