మరోవైపు కొవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం 50వేల రూపాయల పరిహారం ఇస్తోంది. ఇందుకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దరఖాస్తు చేసేటప్పుడు ప్రభుత్వం కొవిన్ డెత్ అని జారీ చేసిన సర్టిఫికేట్ తో పాటు కరోనా పాజిటివ్ రిపోర్టును జత చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ లేకపోతే వైరస్ కారణంగా అడ్మిట్ అయిన ఆసుపత్రి నుంచి డెత్ సర్టిఫికేట్ సమర్పించాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలతో మీసేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలి.
ఇక కరోనాకు గురైన వారిలో సహజంగా వచ్చే యాంటీబాడీలతో పోలిస్తే.. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్న వారిలో అధికంగా యాంటీబాడీలు ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది. డెల్టా వేరియంట్ ను కూడా ఈ టీకాలు అడ్డుకుంటున్నాయని కెనడాలోని మాంట్రియల్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. యువకుల్లో కంటే 50ఏళ్ల వయసు వారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని గుర్తించారు.
ఇక నిన్నటితో పోలిస్తే.. మన దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 10వేల 126 నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 11వేల 466 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే 460మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4లక్షల 61వేల 849కి చేరింది. ఇక దేశంలో ప్రస్తుతం లక్షా 39వేల 683యాక్టివ్ కేసులున్నాయి. మొత్తానికి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక విషయం ప్రకటించింది.