ఓ వైపు రాష్ట్రంలో రహదారులన్నీ భయంకరంగా మారిపోయాయి. ఏ రోడ్డు చూసినా కూడా గోతుల మయమే. వీటిని రిపేరు చేసేందుకు ఆర్థిక శాఖ టెండర్లు పిలిస్తే.. ముందుకు వచ్చే కాంట్రాక్టరు కరువయ్యాడు. రహదారుల మరమ్మతులకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని సాక్షాత్తు సీఎం ఆదేశించినా కూడా... పెద్దగా ఫలితం లేకుండా పోయింది. కేంద్ర రహదారి నిధి కింద సెప్టెంబర్ నెలలో 250 కోట్ల రూపాయల పనులు చేశారు కాంట్రాక్టర్లు. ఆ బిల్లులు రాకపోవడంతో... కొత్త పనులు చేసేది లేదని తేల్చి చెప్పేశారు. వీటికి తోడు ఇప్పుడు అంగన్వాడీలకు కోడి గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు కూడా చేతులెత్తే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు 110 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. దాదాపు 4 నెలలుగా బిల్లులు నిలిచిపోవడంతో... గుడ్లను సక్రమంగా సరఫరా చేయలని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సరఫరా నిలిచిపోయింది కూడా.
ఓ వైపు రాష్ట్రంలో రహదారులన్నీ భయంకరంగా మారిపోయాయి. ఏ రోడ్డు చూసినా కూడా గోతుల మయమే. వీటిని రిపేరు చేసేందుకు ఆర్థిక శాఖ టెండర్లు పిలిస్తే.. ముందుకు వచ్చే కాంట్రాక్టరు కరువయ్యాడు. రహదారుల మరమ్మతులకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని సాక్షాత్తు సీఎం ఆదేశించినా కూడా... పెద్దగా ఫలితం లేకుండా పోయింది. కేంద్ర రహదారి నిధి కింద సెప్టెంబర్ నెలలో 250 కోట్ల రూపాయల పనులు చేశారు కాంట్రాక్టర్లు. ఆ బిల్లులు రాకపోవడంతో... కొత్త పనులు చేసేది లేదని తేల్చి చెప్పేశారు. వీటికి తోడు ఇప్పుడు అంగన్వాడీలకు కోడి గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు కూడా చేతులెత్తే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు 110 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. దాదాపు 4 నెలలుగా బిల్లులు నిలిచిపోవడంతో... గుడ్లను సక్రమంగా సరఫరా చేయలని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సరఫరా నిలిచిపోయింది కూడా.