కరోనా బాధితులను పరామర్శించడం తో పాటు వారికి ప్రతి రోజూ అందు బాటులో ఉన్నారు. వారికి మాస్కుల తో పాటు శానిటైజర్లు అందేలా చేయడంలో తన వంతు గా కృషి చేశారు. ఇక కరోనా రోగులకు ఆసుపత్రు లకు సిఫార్సు చేసే విషయం లో ఆయన ఎప్పుడూ అలెర్ట్ గానే ఉన్నారు. కరోనా రోగుల్లో ఎంతో మంది ఆయన చేసిన సేవలు, సిఫార్సుల వల్లే ప్రాణాపాయ స్థితికి వెళ్లి కూడా బతికి బయట పడ్డారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఆర్థర్ చేసిన కరోనా సేవలను గుర్తిస్తూ లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఎమ్మెల్యే ఆర్థర్ను సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్ కు ఎంపిక చేసి అభినందించింది. త్వరలోనే నియోజకవర్గ కేంద్రమైన నందికొట్కూరులో త్వరలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్ కు సన్మాన కార్యక్రమం పెట్టారు.
ఈ సన్మాన కార్యక్రమం లోనే ఆయనకు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఈ సర్టిఫికెట్ అంద జేస్తారని ఆ ప్రతినిధులు తెలిపారు. తనకు ఈ అవార్డు రావడం పై ఎమ్మెల్యే ఆర్థర్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా కట్టడి లో తాను చేసిన సేవలను జగన్ సైతం కొని యాడారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆర్థర్ కు పలువురు రాజకీయ , స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.