రాష్ట్రాన్ని జాగర్తగా చూసుకునే పరిస్థితి కేటీఆర్ కు ఉంటె, తాజా తెలంగాణ విమోచన దినం రోజున ఆయననే వాళ్ళ నేతగా ఎన్నుకోవాల్సింది, కానీ మళ్ళీ కేసీఆర్ ను తెరాస తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీనిని పరిగణలోకి తీసికుంటే, కేటీఆర్ పై రాష్ట్ర బాధ్యతలు ఇప్పుడే పెట్టడం మంచిది కాదనే అభిప్రాయం కేసీఆర్ కు వచ్చినట్టే కాబట్టి; రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టి బీజేపీ నోట్లోకి ఆయనను తోసేయడనే అభిప్రాయం కూడా వస్తుంది. అందుకే కేంద్రంపై పేరుకు ఫ్రంట్ అంటున్నాడు తప్ప దానికి తగ్గ ఏర్పాట్లు పెద్దగా ఏమి చేయబోవడం లేదు. తెరాస కు కూడా తెలిసి ఉండవచ్చు ఈసారి ఎన్ని చేసినా రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఖాయం అని, కానీ పోరాడటం లేదా తెలంగాణ ప్రాంతీయవాదం మరోసారి తెరపైకి తేవడం ద్వారా సరాసరి మెజారిటీ సీట్లతో బయటపడటానికి ఈ ఎత్తులు వేస్తున్నట్టుగానే ఉంది.
ఆ అవకాశం బీజేపీ ఇవ్వకుండా వీలైనంత ఎక్కువ మెజారిటీ తో తెలంగాణాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఏమి లేదన్నప్పుడే నాలుగు సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ, ఇంకా ఆగే అవకాశాలు తక్కవే. తెరాస నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. అధికార పార్టీ ఎన్ని పన్నాగాలు వేసినప్పటికీ పరిస్థితిలో మార్పులు రావు. పొరపాటున మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తే, తెరాస పరిస్థితి దయనీయంగా తయారయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. దానికి ముందు తెరాస సిద్ధంగా ఉండాల్సి ఉంది.