కాబట్టి తెలంగాణ బిజెపి నాయకులు బండి సంజయ్ తరహాలో అన్ని జిల్లాల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళితే పరిస్థితి మరో రకంగా ఉండేది. కానీ చాలామంది తెలంగాణ బిజెపి నాయకులు దానికి దూరంగా ఉండటంతో బండి సంజయ్ ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం కావడం ప్రజా ఉద్యమాలకు దూరం కావడం వంటి ఇప్పుడు ఇబ్బందికరంగా మారుతుంది.
మాజీ రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్రావు పెద్దగా మీడియా లో కనబడే ప్రయత్నం చేయడం లేదు అనే భావన కూడా ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకులు అందరితో సమ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నా సరే కేవలం ఆయన ఢిల్లీకి మాత్రమే పరిమితం అవుతున్నారు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కేవలం విమర్శ కు మాత్రమే పరిమితం కావడం పట్ల బిజెపిలో భిన్నాభిప్రాయాలున్నాయి. మరి వీళ్ళు అందరూ ఎప్పుడూ మాట్లాడతారు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లాలి పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారు అనేది కాలమే సమాధానం చెప్పాలి.