ఈ సందర్భంగా ఏఐసీసీ వార్ రూమ్ లో జరిగిన భేటీ రచ్చరచ్చగా మారిందని తెలుస్తుంది.. రాహుల్ గాంధీ సన్నిహితుడు కేసి వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో వాడివేడిగా చర్చ సాగింది. దీంతో బై పోల్ ప్రకంపనలు కాంగ్రెస్లో ఇంకా చల్లారడం లేదు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 3 వేల ఓట్లు మాత్రమే రావడం ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కు కొందరు కాంగ్రెస్ నేతలు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లుగా ఆరోపణలు రావడంతో టిపిసిసి చీఫ్ ను టార్గెట్ చేసేలా కొందరు ప్రయత్నాలు చేయడం తెలిసిందే. ఇలాంటి వేళ ఈ ఓటమిపై సమీక్షను ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ లో పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ వార్ రూమ్ లో జరిగిన భేటీ రచ్చరచ్చగా మారిందని తెలుస్తుంది.. రాహుల్ గాంధీ సన్నిహితుడు కేసి వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో వాడివేడిగా చర్చ సాగింది. దీంతో బై పోల్ ప్రకంపనలు కాంగ్రెస్లో ఇంకా చల్లారడం లేదు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 3 వేల ఓట్లు మాత్రమే రావడం ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కు కొందరు కాంగ్రెస్ నేతలు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లుగా ఆరోపణలు రావడంతో టిపిసిసి చీఫ్ ను టార్గెట్ చేసేలా కొందరు ప్రయత్నాలు చేయడం తెలిసిందే. ఇలాంటి వేళ ఈ ఓటమిపై సమీక్షను ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ లో పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నిర్వహించారు.