ప్రస్తుతం వేతనాల పెంపును మూడు కేటగిరిలుగా ఆర్టీసీ యాజమాన్యం విభజించింది. నైపుణ్యం లేని కార్మికులకు 294 రూపాయలు, కొంత మేరకు మాత్రమే ఉన్న వారికి 349 రూపాయలు, నైపుణ్య కార్మీకులకు 428 రూపాయలుగా అధికారులు నిర్ణయించారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 322 రూపాయలు, అటెండర్లకు 294 రూపాయలు, భద్రతా సిబ్బందికి 304 రూపాయలు చొప్పున వేతనం పెంచుతున్నట్లు ఆర్టీసీ నిర్ణయించింది. జీతం పెంపు నిర్ణయం గత నెల అక్టోబర్ నుంచే అమలులో ఉంటుందన్నారు అధికారులు. కొవిడ్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో తిరిగే అంతర్రాష్ట్ర సర్వీసులపై బ్రేక్ పడింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ... రెండు రాష్ట్రాల మధ్య బస్సులు మాత్రం ఆరంభం కాలేదు. దీనితో తెలంగాణ రాష్ట్ర డిమాండ్లకు తలొగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ చివరికి వారు చెప్పినట్లుగా చేసింది. అయితే ఇప్పుడు ప్రయాణీకుల రద్దీ క్రమంగా పెరగడంతో... తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని సర్వీసులు నడపాలని టీఎస్ ఆర్టీసీ సంస్థకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు.
ప్రస్తుతం వేతనాల పెంపును మూడు కేటగిరిలుగా ఆర్టీసీ యాజమాన్యం విభజించింది. నైపుణ్యం లేని కార్మికులకు 294 రూపాయలు, కొంత మేరకు మాత్రమే ఉన్న వారికి 349 రూపాయలు, నైపుణ్య కార్మీకులకు 428 రూపాయలుగా అధికారులు నిర్ణయించారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 322 రూపాయలు, అటెండర్లకు 294 రూపాయలు, భద్రతా సిబ్బందికి 304 రూపాయలు చొప్పున వేతనం పెంచుతున్నట్లు ఆర్టీసీ నిర్ణయించింది. జీతం పెంపు నిర్ణయం గత నెల అక్టోబర్ నుంచే అమలులో ఉంటుందన్నారు అధికారులు. కొవిడ్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో తిరిగే అంతర్రాష్ట్ర సర్వీసులపై బ్రేక్ పడింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ... రెండు రాష్ట్రాల మధ్య బస్సులు మాత్రం ఆరంభం కాలేదు. దీనితో తెలంగాణ రాష్ట్ర డిమాండ్లకు తలొగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ చివరికి వారు చెప్పినట్లుగా చేసింది. అయితే ఇప్పుడు ప్రయాణీకుల రద్దీ క్రమంగా పెరగడంతో... తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని సర్వీసులు నడపాలని టీఎస్ ఆర్టీసీ సంస్థకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు.