ప్రకాశం జిల్లాలో దర్శి తప్ప అన్నీ వైసీపీ కైవసం చేసుకుంది అని ఈ ప్రజాతీర్పు 2024 గెలుపుకు నాంది అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. 2024 తరువాత టీడీపీ అంతర్దానం అవుతుంది అని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రానికి ఇది ఒక కార్తీక పౌర్ణమి అని చంద్రబాబుకు గ్రహణం పట్టింది అన్నారు. హైదరాబాదులో చంద్రబాబు ఇకపై ప్రవాసాంధ్రుడు అని ఎద్దేవా చేసారు. చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడింది అని వ్యాఖ్యలు చేసారు. ప్రజా న్యాయస్ధానంలో చంద్రబాబు మేనేజ్ చేయలేడని ఆయన గుర్తించాలి అన్నారు.

ఇంతకు ముందు గ్రామీణం.. ఇప్పుడు నగర ప్రాంతాలు కూడా చంద్రబాబు ను ఓడించాయి అని ప్రస్తావించారు. సీఎం జగన్ పాలన ప్రజారంజకం అని కొనియాడారు విజయసాయి రెడ్డి. రాబోయే రెండు దశాబ్దాలు సీఎం జగన్ పరిపాలిస్తారు అని జోస్యం చెప్పారు. చంద్రబాబు ప్రచారాలను అబద్ధాలను విశ్లేషించాలని.. టాక్ షోలు కొనసాగించాలని కోరుతున్నా అన్నారు. ఆ టాక్ షోల వల్లనే చంద్రబాబు ఓడిపోయాడు అని ఎద్దేవా చేసారు. లోకేష్ కేసులపై 48 గంటల్లో స్టే తెస్తాననటంపై కంటెంప్ట్ యాక్ట్ కింద కోర్టులు పరిగణించాలి అని విజ్ఞప్తి చేసారు.

లోకేష్, చంద్రబాబు కూడా సీట్లు వెతుక్కోవాల్సిందే అని అన్నారు. లోకేష్ తండ్రిని ముంచిన తనయుడు అని జగన్ తండ్రిని మించిన తనయుడు అని ఆయన కొనియాడారు. కారు మీద కాలరెగరేసి బూతులు తిడితే సీట్లు రావని లోకేష్ గమనించాలి అని హితవు పలికారు. రాబిన్ శర్మ అనే టీడీపీ సోషల్ మీడియా వ్యక్తిని పెట్టుకున్నాడు చంద్రబాబు అని ఏం పీక్కుంటారు అని అడిగితే ప్రజలు కుప్పం పీక్కున్నారు అన్నారు. అచ్చెం నాయుడి అంచనా నిజమే... పార్టీ లేదు బొక్క లేదన్నట్టు, కుప్పం లేకుండా పోయింది అని ఎద్దేవా చేసారు. స్వయంగా కేంద్ర హోంమంత్రి చెప్పినట్టు టీడీపీ ముగిసిన అధ్యాయం అన్నారు. భవిష్యత్తులో సెలవు సెలవు చంద్రన్న అంటారు అని భవిష్యత్తులో చంద్రబాబు ఏపీ కి వచ్చే అర్హత లేకుండా పోతాడు అని వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: