ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరుగుతాయో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది.. దీంతో చాలా మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని సాగిస్తున్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లకు సవాల్ విసురుతూ వరుసగా బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నారు ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల. తీవ్రవాదుల చర్యలను అడ్డుకుంటామంటూ తాలిబన్లు చెబుతున్నప్పటికీ బాంబు పేలుళ్లు మాత్రం ఆగటం లేదు. వారంలో దాదాపు రెండు మూడు సార్లు బాంబు పేలుళ్లు జరుగుతూ ఉండటం గమనార్హం.
ఇలా వరుసగా ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ బాంబు పేలుళ్లతో వణికిపోతుంది. ఇక ఇటీవలే ఒక్కరోజే రెండు బాంబు పేలుళ్లు జరగడం సంచలనంగా మారిపోయింది. కారు లో బాంబు పేలిన ఘటనలు ఏకంగా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఇక ఉదయం సమయం లో జరిగిన బాంబు పేలుడులో మొత్తంగా నలుగురు మృతి చెందడం గమనార్హం. ఇస్లామిక్ స్టేట్ కి చెందిన ఉగ్రవాదులు ఎక్కువగా ఈ బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకే రోజు రెండు బాంబు పేలుళ్లు జరగడం మాత్రం సంచలనంగా మారిపోయింది. వరుస బాంబు పేలుళ్లు తాలిబాన్లకు సవాలుగా మారిపోతున్నాయి.