అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే.. ప్రారంభం అయింది. అయితే.. ఈ సమావేశాలు చాలా హాట్‌ హాట్‌ గా నడుస్తున్నాయి. రైతు సంక్షేమం, వ్యవసాయం పై జరుగుతోన్న చర్చలో హాట్ హాట్ డిస్కషన్ చేస్తున్నారు. వ్యవసాయం విషయంలో పదే పదే చంద్రబాబు పేరు ప్రస్తావిస్తున్నారని టీడీపీ అభ్యంతరం తెలిపింది. చంచల్ గూడ జైల్లో సమావేశాలు పెట్టుకునే పార్టీ వైసీపీ అంటూ టీడీపీ కామెంట్లు చేస్తున్నారు. టీడీపీ కామెంట్లపై వైసీపీ తీవ్ర మండిపడింది.  

చంద్రబాబులా మేం లుచ్చా పనులు చేయడం లేదన్నారు మంత్రి కొడాలి నాని. కొడాలి నాని కామెంట్లను తప్పు పట్టారు చంద్రబాబు. వ్యవసాయం పై చర్చ కాకుండా మిగతా విషయాలపై చర్చకు సిద్దమేనన్నారు మాజీ సీఎం నారా  చంద్రబాబు నాయుడు. చర్చ లో భాగంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతోన్న సందర్భంలో రన్నింగ్ కామెంటరీ చేశారు అచ్చెన్నాయుడు. పార్టీ లేదు బొక్కా లేదన్న ఓ పార్టీ అధ్యక్షుడ్ని తొ లి సారి చూ స్తున్నామంటూ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశౄరు. కుప్పం మా లెక్కలోకే లేదన్న తెలుగు దేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె న్నాయుడు గురించి ఇంకేం మాట్లాడగలమంటూ కన్నబాబు సెటైర్లు పేల్చారు.  

ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ పెడదామంటే అచ్చెన్నాయు డు మైండ్ బ్లాంక్ అయిందన్నారు ఆంద్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కన్నబాబు. మంగళగిరిలో తనయుడు ఓటమిని తట్టుకు న్న గుండె కుప్పం ఓటమిని చంద్రబాబు తట్టుకోలేరా అంటూ ఆంద్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కన్నబాబు వ్యంగ్యోక్తులు అన్నా రు. అటు శాసన మండలిలో ఎయిడెడ్ సంస్థల విలీనంపై చర్చ... విలీన నిర్ణయాన్ని తప్పు పడుతోన్నారు నారా లోకేష్. అనంతపురంలో విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించారనే అంశాన్ని ఫొటోలతో సహా ప్రజెంట్ చేశారు లోకేష్.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap