ఇదంతా ఏపీలో మేము గెలిచాం, అంతా మేము చేసుకోగలం అనే ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నప్పుడు, అసలు వాళ్ళను అడుగు కూడా వేయకుండా విపక్షం తన చేతులలో ఉన్న వ్యవస్థలతో ఎలా అడ్డుకోగలిగిందో అలాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంపట్ల విపక్షాలు అంతే వ్యూహాత్మకంగా ప్రతిఘటించగలిగాయి. దానితో కేంద్రం పరిస్థితి వెనక్కి తగ్గాల్సినంత వరకు వచ్చేసింది. ఇదంతా ఈ రెండు పరిస్థితులలో విపక్షాలను తక్కువ అంచనా వేయడం వలన ఆయా ప్రభుత్వాల కు జరిగిన నష్టంగా భావించాల్సి ఉంది. వ్యవస్థలను ఎలా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనేది అడ్డం పెట్టుకొని పై రెండు సందర్భాలలో విపక్షాలు ప్రవర్తించాయి, ప్రభుత్వాలను అడుగు ముందుకు వేయనీయకుండా అడ్డుకున్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఇకనైనా మేల్కొంటే ఇలాంటి దుస్థితి మరో దానిలో రాకుండా ఉంటుంది.
రైతులకు మేలు ఈరోజు కాకపోతే రేపు చేయొచ్చు, మరోరకంగా చేయొచ్చు. కానీ ఇంకా రైతు ఉద్యమం పేరుతో విపక్షాల ఆటలు కొనసాగనివ్వకూడదు అనే భావనతో బీజేపీ చట్టాలను రద్దుచేసింది. ఇక విపక్షాలు మరో కారణం వెతుక్కొని సమయంలో ప్రభుత్వం తన వ్యూహాలను అమలు చేయడం ద్వారా విపక్షాల నోరు నొక్కేయొచ్చు అనేది ప్రస్తుత ఆలోచన కావచ్చు. చూడాలి తదుపరి బీజేపీ ఆలోచన ఏమిటో అని. దీనిపై వెనక్కి తగ్గని కేంద్రం తగ్గిందంటే దానివెనుక ఎటువంటి కారణం లేకుండా మాత్రం చేసి ఉండదు అనేది ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకు తీరాలి. విపక్షాల జుట్టుగాని దొరికిందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది.