రష్యా నుండి ఎవరు ఆయుధాలు కొనుగోలు చేసినప్పటికీ అమెరికా వారిపై ఆంక్షలు పెడుతుంది. అలాగే భారత్ కూడా ఎస్400 కొనుగోలు చేసే ముందు కూడా దానిపై బాగా చర్చ నడిచింది. కానీ భారత్ మొండిగా కొనడంతో ఇప్పటికే అవి భారత్ కు చేరుకున్నాయి. అయినా అమెరికాలో పార్లమెంట్ వర్గాల మాటలతో ఏకీభవించిన అధ్యక్షుడు ఆంక్షలు పెట్టలేదు కానీ గొణగడం మాత్రం మానలేదు. అందుకే భారత్ ఆ దేశం నుండి కూడా ఏదైనా కొనాలని, అవసరం అనిపించిన డ్రోన్లను 21000కోట్లతో 30 వరకు కొనుగోలు చేసింది. ముందు చెప్పినట్టుగా ఇవన్నీ ఒక్కసారి వాడకానికి, పిలిస్తే అయిపోయినట్టే. ఇదో రకం బుజ్జగింపు అంతర్జాతీయంగా సహజం.
ఇలా భారత్ అంతర్జాతీయంగా కూడా తనకు ఎదురయ్యే సమస్యలను చాకచక్యంతో ఎదురుకొంటూ ముందుకు వెళ్తుంది. భారత్ వద్ద ముందుగానే ఎన్95 డ్రోన్లు ఇదేతరహావి ఉన్నప్పటికీ, అవి ఇతర ప్రాంతాలలో బాగా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం కొన్నవి సముద్ర పై భాగంలో ఉపయోగించడానికి ఉపయుక్తంగా ఉంటాయి. సముద్ర మార్గాలలో కూడా పాక్, చైనా ఇటీవల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ధీటుగా ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటుంది భారత్.