దేవుడి చేతిలో మనిషి జీవితాలు కీలుబొమ్మలు.. అవునా ఇది నిజమా అంటే వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది.. అయ్యో దేవుడా ఇంత దారుణమా ఎందుకయ్యా ఇంత కక్ష కట్టావ్ అని కొన్ని ఘటనల  గురించి ప్రతి ఒక్కరుదేవుడిని ప్రశ్నిస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు అంటే కన్నబిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ విధి కక్షగట్టి  సొంత వాళ్ల చేతిలోనే కన్న బిడ్డల ప్రాణాలు తీసేలా చేస్తూ ఉంటుంది. ఇలా ఇటీవలి కాలంలోఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.


 కొడుకు పుట్టాడని ఆ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషపడి పోయారు. ఏ కష్టం రాకుండా అల్లారుముద్దుగా ఆ కొడుకుని చూసుకుంటున్నారు. డాడీ ఇది కావాలి అని అడిగే లోపే కొడుక్కి  కావలసినవి అన్నీ తెచ్చి పెడుతున్నాడా తండ్రి.. అమ్మ ఆకలి వేస్తుంది అడగకముందే బుజ్జగించి మరి గోరుముద్దలు  పెడుతుంది ఆ తల్లి.. వారి కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా గడిచిపోతుంది. కానీ అంతలో ఆ కుటుంబం పై విధి కన్నుకుట్టింది. చివరికి సంతోషంగా సాగిపోతున్న జీవితంలో విషాదం నింపాలి అని నిర్ణయించుకుంది. ప్రాణంగా చూసుకున్న చిన్నారి ప్రాణాలను తీసేయాలి అని నిర్ణయించుకుంది. అది కూడా ఏకంగా కన్నతండ్రి చేతిలోనే ప్రాణాలు పోయేలా చేసి అరణ్యరోదన ను మిగల్చాలి అని అనుకుంది.


 చివరికి విధి ఆడిన వింత నాటకంలో అభం శుభం తెలియని ఆ చిన్నారి బలి అయిపోయింది. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మన్సూరాబాద్ కాస్మోపాలిటన్ కాలనీలో వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన అందర్ని కంటతడి పెట్టిస్తుంది. ఇంటి ముందు రోడ్డుపై ఆడుకుంటున్నాడు చిన్నారి సాత్విక్. ఇంతలో కార్ తీసుకొని తండ్రి లక్ష్మణ్ అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలోనే కార్ రివర్స్ తీస్తున్న సమయంలో ఫాస్ట్ గా నడిపాడు. సాత్విక్ కార్ కింద పడి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఇక వెంటనే గమనించి హాస్పిటల్ కి తరలించి లోపల బాలుడు మృతి చెందాడు. అయితే భర్త లక్ష్మణ్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య రాణి.

మరింత సమాచారం తెలుసుకోండి: