మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఉపసంహరించుకోనున్నామని అడ్వకేట్ జనరల్ ఇవాళ హైకోర్టుకు వి న్నవించారు. దీంతో ఇంతకాలం రాజధానులకు సంబంధించి అంశం పై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. అయితే మూడు కాదు రెండు రాజధానుల ఏర్పాటుకు తాము సుముఖం అని సీఎం ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇవేవీ కాదు వైజాగే మా రాజధాని అని ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదని తేల్చేస్తున్నాయి ఇంకొన్ని వర్గాలు. ఏదేమయినప్ప టికీ కాసేపట్లో క్యాబినెట్ భేటీ అనంతరం పూర్తి వివరాలు అందేందుకు ఛాన్స్ ఉంది. అందాక వచ్చేవన్నీ ఊహాగానాలే!
ఇక మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ చేస్తే ఆ క్రెడిట్ మొత్తం బాబుకు వెళ్లిపోతుంది. ఎందుకంటే రాజధాని రైతులను అడ్డం పెట్టుకుని ఇంతకాలం చేస్తున్న ఉద్యమానికి అధినేత ఆయనే కనుక! ఈ దశలో అలాంటి సానుకూల పరిణామాలు టీడీపీ విషయమై ఏర్పడడం ఇష్టంలేక, కష్టం అయినా సరే అమరావతిని రాజధానిగా ఒప్పుకునేందుకు కాస్త ఎక్కువ అవకాశమే ఉంది.
మరోవైపు టీడీపీ ఎంతగానో పొలిటికల్ మైలేజీ ఇచ్చిన మరియు ఇస్తున్న అమరావతిని తమకు అనుకూలంగా మార్చి, ఏ క్షణంలో అయినా జగన్ రాజధాని రైతులకు క్షమాపణలు చెప్పి చర్చలకు ఆహ్వానించవచ్చు.