మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వ అనాలోచిత ప్రకటన చేసిందన్నారు రఘురామ. అయితే ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం 2 రాజధానులనే మాట ఎత్తుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవద్దని సూచించారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇప్పటికే కేంద్రం గుర్తించిన, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శంఖుస్థాపన చేసిన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలోనే జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు ఎంపీ రఘురామ. తిరుపతిలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన తర్వాతే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు రఘురామ కృష్ణంరాజు. మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు మాత్రం తమ యాత్రను కొనసాగించాలన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఇప్పటికే అమరావతి జేఏసీ ప్రకటించింది కూడా.
మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వ అనాలోచిత ప్రకటన చేసిందన్నారు రఘురామ. అయితే ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం 2 రాజధానులనే మాట ఎత్తుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవద్దని సూచించారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇప్పటికే కేంద్రం గుర్తించిన, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శంఖుస్థాపన చేసిన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలోనే జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు ఎంపీ రఘురామ. తిరుపతిలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన తర్వాతే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు రఘురామ కృష్ణంరాజు. మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు మాత్రం తమ యాత్రను కొనసాగించాలన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఇప్పటికే అమరావతి జేఏసీ ప్రకటించింది కూడా.