రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా విశాఖపట్నం ఉందని ... అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పిన జగన్ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే హైదరాబాద్ - చెన్నై - బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పోటీపడే పరిస్థితి ఉంటుందని చెప్పారు. రాజధాని ప్రాంతం అటు గుంటూరు , ఇటు విజయవాడ లో లేదని చెప్పిన జగన్ అమరావతిలో రోడ్లు , డ్రైనేజీ , కరెంట్ సౌకర్యాలు అభివృద్ధి చేయాలంటేనే లక్షల కోట్లు అవుతాయని చెప్పారు.
ఇక మూడు రాజధాను ల పై సమగ్రమైన బిల్లును తీసుకువస్తామని ... ఇంతకుముందు ఉన్న బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని జగన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జగన్ చేసిన ప్రకటనను బట్టి చూస్తే మూడు రాజధానులు విషయంలో ప్రభుత్వం ఎంత మాత్రం వెనక్కి తగ్గటం లేదని అర్థమవుతుంది.
తన సీమ ప్రాంతానికి ఎలాగూ సచివాలయం, అసెంబ్లీ ని మార్చలేని పరిస్థితి. ఆ ప్రాంత ప్రజల నుంచి వ్యతిరేక త రాకుండా ఉండేందుకు న్యాయ రాజధానిగా కర్నూలు కొనసాగిస్తారని తెలుస్తోంది. మరి ఈ కొత్త మార్పులు , చేర్పులపై సీమ ప్రాంత ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్లు వస్తాయో ? కూడా చూడాలి.