సంక్షేమ పథకాల అమలులో పొరపాట్లు లేకున్నా రాష్ట్రంలో ప్రశాంతత కరువయిందనే విమర్శలు ఎక్కువవుతుండడంతో ప్రతిపక్ష టీడీపీ సరైన సమయంలో ప్రజల గొంతుకను తమదిగా చేసుకుని వైసీపీపై పోరాటం ప్రారంభించారు. ఇటీవల ముగిసిన స్థానిక ఎన్నికలలో వైసీపీపై వ్యతిరేకత స్టార్ట్ అయిందని చెప్పడానికి కొన్ని చోట్ల టీడీపీ గెలవడం మరియు మరి కొన్ని చోట్ల గట్టి పోటీ ఇవ్వడంతో క్లియర్ గా అర్ధమైంది. అంతే కాకుండా వైసీపీది రౌడీ రాజ్యం అంటూ కొన్ని ఏరియాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది.
అయితే టీడీపీ ఈ వ్యతిరేకతను వాడుకుని రాబోయే ఎన్నికలకు ఉపయోగించుకుంటుందా అన్నది పూర్తిగా వారి చేతిలోనే ఉంది. ఇలా ప్రజల అంచనాలకు విరుద్ధంగా వైసీపీ పాలన ఉండడంతో ప్రజలు పూర్తిగా డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 2019 లో సగానికి పైగా ఓటర్లు టీడీపీని వద్దనుకుని వైసీపీకి పట్టం కట్టారు. అయితే ఇప్పుడు వైసీపీ పాలనలో అంత సంతృప్తిగా లేరనేది చాలా మంది మనస్సులో ఉందని ఈ మధ్య మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ప్రజలు ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా బయటపడరు. అవసరమైన సమయంలో ఓటు రూపంలో సరైన సమాధానం చెబుతారు. ఇది చాలా సార్లు జరిగింది.