అయితే ప్రధాని ప్రకటనను రైతులు మాత్రం ఏ మాత్రం స్వాగతించడం లేదు. బిల్లులను పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఇప్పుడు తాజాగా మరో కీలక వ్యాఖ్య చేశారు రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్. ప్రధాని చేసిన ప్రకటన తమకు సంతోషం కలిగించడం లేదన్నారు. ఏడాది కాలంగా ఈ బిల్లులపై పోరాటం చేసిన తమతో కనీసం చర్చించకుండా చట్టాలను వెనక్కి తీసుకోవడం సరి కాదన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టేందుకు రైతు సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఏడాది కాలంగా రైతులంతా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు మోదీ తీసుకున్న నిర్ణయంతో బీజేపీ సహా... ఎన్డీయే పార్టీలు కాస్త అసహనంతో ఉన్నాయి. ఇదే సమయంలో తమతో చర్చించిన తర్వాతే... నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ తేల్చి చెప్పారు. లక్నోలో సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమంలో రాకేష్ తికాయత్ పాల్గొన్నారు.
అయితే ప్రధాని ప్రకటనను రైతులు మాత్రం ఏ మాత్రం స్వాగతించడం లేదు. బిల్లులను పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఇప్పుడు తాజాగా మరో కీలక వ్యాఖ్య చేశారు రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్. ప్రధాని చేసిన ప్రకటన తమకు సంతోషం కలిగించడం లేదన్నారు. ఏడాది కాలంగా ఈ బిల్లులపై పోరాటం చేసిన తమతో కనీసం చర్చించకుండా చట్టాలను వెనక్కి తీసుకోవడం సరి కాదన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టేందుకు రైతు సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఏడాది కాలంగా రైతులంతా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు మోదీ తీసుకున్న నిర్ణయంతో బీజేపీ సహా... ఎన్డీయే పార్టీలు కాస్త అసహనంతో ఉన్నాయి. ఇదే సమయంలో తమతో చర్చించిన తర్వాతే... నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ తేల్చి చెప్పారు. లక్నోలో సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమంలో రాకేష్ తికాయత్ పాల్గొన్నారు.