నాటి ప్రకటన చేసిన తర్వాత శారదా పీఠాన్ని దర్శించుకునేందుకు తొలిసారి విశాఖ చేరుకున్న వైఎస్ జగన్కు బ్రహ్మరథం పట్టారు ఉత్తరాంధ్ర వాసులు. జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత విశాఖ పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేతను వైసీపీ నేతలు విశాఖ విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. కనీసం ఎయిర్ పోర్టు కూడా దాటనివ్వలేదు. ఒక దశలో రాళ్లతో దాడి కూడా చేసేందుకు యత్నించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎయిర్ పోర్టు బయటే బైఠాయించారు. వెనక్కి తగ్గేది లేదని తేల్చేశారు. చివరికి పోలీసులు అరెస్ట్ చేసి వెనక్కి తరలించాల్సి వచ్చింది. అయితే ఇదంతా గతం. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు విశాఖ సహా ఉత్తరాంధ్ర వాసులు కాస్తంత ఆశ్చర్యపోతున్నారు. ఇదే సమయంలో మరోసారి సమగ్ర బిల్లు తయారు చేస్తామన్న ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకటన చేసిన రెండేళ్లలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సొంత పార్టీ నేతలేమో... న్యాయ పరమైన చిక్కుల కారణంగానే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కాలేదని... మరో బిల్లు ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ సర్కార్ కృషి చేస్తుందంటున్నారు.
నాటి ప్రకటన చేసిన తర్వాత శారదా పీఠాన్ని దర్శించుకునేందుకు తొలిసారి విశాఖ చేరుకున్న వైఎస్ జగన్కు బ్రహ్మరథం పట్టారు ఉత్తరాంధ్ర వాసులు. జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత విశాఖ పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేతను వైసీపీ నేతలు విశాఖ విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. కనీసం ఎయిర్ పోర్టు కూడా దాటనివ్వలేదు. ఒక దశలో రాళ్లతో దాడి కూడా చేసేందుకు యత్నించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎయిర్ పోర్టు బయటే బైఠాయించారు. వెనక్కి తగ్గేది లేదని తేల్చేశారు. చివరికి పోలీసులు అరెస్ట్ చేసి వెనక్కి తరలించాల్సి వచ్చింది. అయితే ఇదంతా గతం. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు విశాఖ సహా ఉత్తరాంధ్ర వాసులు కాస్తంత ఆశ్చర్యపోతున్నారు. ఇదే సమయంలో మరోసారి సమగ్ర బిల్లు తయారు చేస్తామన్న ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకటన చేసిన రెండేళ్లలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సొంత పార్టీ నేతలేమో... న్యాయ పరమైన చిక్కుల కారణంగానే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కాలేదని... మరో బిల్లు ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ సర్కార్ కృషి చేస్తుందంటున్నారు.