ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ చాలావరకు తుడిచి పెట్టుకునిపోయిన విషయం తెలిసిందే. ఇక ఆ పార్టీ రాజకీయంగా దారుణమైన స్థితిలో ఉంది...అయితే కాంగ్రెస్‌కు చెందిన నాయకులు వైసీపీ, టీడీపీల్లో చేరిపోయిన విషయం తెలిసిందే. మెజారిటీ నేతలు వైసీపీలో చేరి ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. అటు కొందరు నేతలు టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ కష్టాల్లో ఉండటంతో ఆ పార్టీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు.

పలువురు మాజీ హస్తం నేతలు చంద్రబాబుకు అండగా ఉండటంలో ముందే ఉన్నారు. అలాగే పార్టీ కోసం కూడా గట్టిగానే పనిచేస్తున్నారు. అలా పలువురు నేతలు పార్టీ కోసం పనిచేస్తూ..పార్టీలో కీలకంగా మారారు. అలా కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్న నాయకుల్లో సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఒకరు. కాంగ్రెస్‌లో ఈయన ఎలాంటి పొజిషన్‌లో ఉండి వచ్చారో అందరికీ తెలుసు.

కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ కాంగ్రెస్ పరిస్తితి బాగోకపోవడంతో, గత ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అటు ఆలూరు అసెంబ్లీలో కోట్ల భార్య సుజాతమ్మ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఓడిపోయాక కొన్ని రోజులు యాక్టివ్‌గా లేరు గానీ, ఇప్పుడు ఇద్దరూ యాక్టివ్ గా ఉన్నారు. పైగా వారి వారి నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నారు.

ఆలూరులో టీడీపీ చాలా వరకు పికప్ అవ్వడానికి కారణం కోట్ల ఫ్యామిలీనే. అలాగే కర్నూలు పార్లమెంట్ పరిధిలో సైతం టీడీపీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఇటు కోట్ల  ఫ్యామిలీ ఇమేజ్ ఎలాగో వర్కౌట్ అవుతుంది. ఇక కనిగిరిలో ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సైతం దూకుడుగా ఉన్నారు. కనిగిరిలో పార్టీని చాలావరకు బలోపేతం చేశారు. అలాగే ఆచంటలో పితాని సత్యనారాయణ సైతం ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నారు. మళ్ళీ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మొత్తానికైతే మాజీ హస్తం నేతలు కాస్త టీడీపీకి ప్లస్ అవుతున్నారనే చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: