అదే ఊపుతో అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. అందుకోసం రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖ నగరాన్ని ఎంపిక చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేని సమయంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో విజయం సాధించారు. ఇంకా చెప్పాలంటే... తన నిర్ణయం సరైందే అని ప్రజలు తీర్పు ఇచ్చారంటూ గర్వంగా చెప్పుకున్నారు. అమరావతి రాజధాని అంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేసినా కూడా... చివరికి విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లను కూడా వైసీపీ గెలుచుకుంది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వైసీపీ జెండా ఎగిరింది. అయితే ఓ వైపు న్యాయస్థానాల్లో కేసుల విచారణ కొనసాగుతున్న సమయంలో... అనూహ్య ప్రకటన చేశారు వైఎస్ జగన్. 3 రాజధానుల ఏర్పాటు బిల్లును ప్రస్తుతానికి రద్దు చేస్తున్నామన్నారు. సమగ్రంగా రూపొందించి మళ్లీ బిల్లు ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన సమయలో కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు సభలో లేరు.
అదే ఊపుతో అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. అందుకోసం రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖ నగరాన్ని ఎంపిక చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేని సమయంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో విజయం సాధించారు. ఇంకా చెప్పాలంటే... తన నిర్ణయం సరైందే అని ప్రజలు తీర్పు ఇచ్చారంటూ గర్వంగా చెప్పుకున్నారు. అమరావతి రాజధాని అంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేసినా కూడా... చివరికి విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లను కూడా వైసీపీ గెలుచుకుంది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వైసీపీ జెండా ఎగిరింది. అయితే ఓ వైపు న్యాయస్థానాల్లో కేసుల విచారణ కొనసాగుతున్న సమయంలో... అనూహ్య ప్రకటన చేశారు వైఎస్ జగన్. 3 రాజధానుల ఏర్పాటు బిల్లును ప్రస్తుతానికి రద్దు చేస్తున్నామన్నారు. సమగ్రంగా రూపొందించి మళ్లీ బిల్లు ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన సమయలో కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు సభలో లేరు.