గతంలో అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం పొందిన బిల్లులు ఇప్పుడు రద్దు అయినప్పటికీ... ఆ వివరాలు హైకోర్టుకు సమర్పించాలి. వచ్చే శుక్రవారం నాటికి బిల్లులకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు సమర్పించాలని కూడా రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత... మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణను సోమవారం నుంచి తిరిగి ప్రారంభిస్తామని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని త్రి సభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఇదే అంశం కీలకంగా మారింది. బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టు అడ్వకేట్ జనరల్ తెలిపిన కొద్ది సేపటికి అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే బిల్లులు రద్దు చేసినట్లు తెలిపినప్పటికీ... సభలో వైఎస్ జగన్ మాత్రం... మళ్లీ బిల్లు పెడతామని ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. మండలిలో ఇప్పటి వరకు 3 రాజధానుల బిల్లులు ఆమోదం పొందలేదు. అటు గవర్నర్ దృష్టికి కూడా ఆమోదం పొందినట్లు భావించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ పరిస్థితుల్లో బిల్లును మండలిలో రద్దు చేయాలా వద్దా అనే అంశంపై మండలిలో ఎలా ప్రస్తావించాలని ప్రభుత్వం భావిస్తోంది.
గతంలో అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం పొందిన బిల్లులు ఇప్పుడు రద్దు అయినప్పటికీ... ఆ వివరాలు హైకోర్టుకు సమర్పించాలి. వచ్చే శుక్రవారం నాటికి బిల్లులకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు సమర్పించాలని కూడా రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత... మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణను సోమవారం నుంచి తిరిగి ప్రారంభిస్తామని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని త్రి సభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఇదే అంశం కీలకంగా మారింది. బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టు అడ్వకేట్ జనరల్ తెలిపిన కొద్ది సేపటికి అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే బిల్లులు రద్దు చేసినట్లు తెలిపినప్పటికీ... సభలో వైఎస్ జగన్ మాత్రం... మళ్లీ బిల్లు పెడతామని ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. మండలిలో ఇప్పటి వరకు 3 రాజధానుల బిల్లులు ఆమోదం పొందలేదు. అటు గవర్నర్ దృష్టికి కూడా ఆమోదం పొందినట్లు భావించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ పరిస్థితుల్లో బిల్లును మండలిలో రద్దు చేయాలా వద్దా అనే అంశంపై మండలిలో ఎలా ప్రస్తావించాలని ప్రభుత్వం భావిస్తోంది.