ఏపీ రాజకీయాలు ఎంత రచ్చరచ్చగా చురుగ్గా మారాయో మనం చూస్తూనే ఉన్నాం. గత నాలుగు రోజులుగా అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ ప్రస్తావన తీసుకు వచ్చినప్పుడు నుంచి రాజకీయంగా అధికార వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య పెద్ద దుమారమే రేగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి ప్రస్తావన తీసుకు రావడంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. అసలు ఈ ప్రస్తావన రావడానికి ప్రధాన కారణం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. వంశీ తెలుగు దేశం పార్టీని వీడిన‌ప్ప‌టి నుంచి చంద్ర‌బాబు ,లోకేష్ ను ఎంత నీచ‌మైన ప‌దాలు వాడుతూ అవ‌మానిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం.
 
కొద్ది రోజుల క్రిందట వంశీ స్వయంగా నారా లోకేష్ ప్రస్తావన తీసుకు వచ్చి మాజీ హోంమంత్రి మాధవ రెడ్డి హత్య గురించి ప్రస్తావించడంతో లేనిపోని సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే అప్పుడే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ... ఆ పార్టీ నాయకులు వంశీకి గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేది. అప్పుడు తెలుగు దేశం వాళ్లు నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్న చందంగా వ్య‌వ‌హ‌రించారు. చివ‌ర‌కు కృష్ణా జిల్లా టీడీపీ నేత‌లు కూడా పెద్ద గా మాట్లాడ‌లేదు.

ఆ విషయాన్ని ఇప్పుడు  వైసిపి వాళ్ళు ఉపయోగించుకుని అసెంబ్లీలో చంద్రబాబు ను గట్టిగా టార్గెట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే బాబు ఆవేదనకు ఇంతలా కారణమైన వంశీని టిడిపి వాళ్ళు గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం లో వంశీ ని ఎలాగైనా చిత్తుగా ఓడించి క‌సి తీర్చుకోవాలని భావిస్తున్నారు. మంత్రి కొడాలి నాని కంటే వంశీ యే త‌మ‌కు ఫ‌స్ట్ టార్గెట్ అంటున్నారు.

ఇందుకు తగినట్టుగా బలమైన అభ్యర్థిని అక్కడ నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీలో కొందరు కీలక నేతలు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పుడే తమకు వంశీ ఓట‌మి కోసం ఆ పార్టీ నేతలు ప్ర‌తిజ్ఞ‌లు చేస్తున్నారు అటే గన్నవరం టిడిపి వాళ్ళు ఎంత గట్టిగా ప‌ని చేస్తున్నారో అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: