గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు సిబ్బంది. ఇందులో ఏకంగా 29 మందికి వైరస్ పాజిటివ్గా వచ్చింది. దీంతో సిబ్బంది షాక్ అయ్యారు. వైరస్ తగ్గుముఖం పట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఓ వైపు ప్రకటించినప్పటికీ... క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. రెసిడెన్సియల్ పాఠశాలల్లో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇప్పుడు ఏకంగా 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలింది. విద్యార్థులకు కరోనా ఉన్నట్లు తెలియడంతో... మిగిలిన విద్యార్థులు తల్లిదండ్రులు... తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఇక భోధన, భోధనేతర సిబ్బంది కూడా ప్రస్తుతం కలవర పడుతున్నారు. వైరస్ సోకడానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గురుకుల పాఠశాలలో కనీస వసతులు లేవని... అసలు కరోనా జాగ్రత్రలు పాటించడం లేదన్నారు. లక్షణాలున్నట్లు ముందుగా తోటి విద్యార్థులు తెలిపినా కూడా... అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా సోకిన వారికి స్పల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని... పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు సిబ్బంది. ఇందులో ఏకంగా 29 మందికి వైరస్ పాజిటివ్గా వచ్చింది. దీంతో సిబ్బంది షాక్ అయ్యారు. వైరస్ తగ్గుముఖం పట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఓ వైపు ప్రకటించినప్పటికీ... క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. రెసిడెన్సియల్ పాఠశాలల్లో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇప్పుడు ఏకంగా 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలింది. విద్యార్థులకు కరోనా ఉన్నట్లు తెలియడంతో... మిగిలిన విద్యార్థులు తల్లిదండ్రులు... తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఇక భోధన, భోధనేతర సిబ్బంది కూడా ప్రస్తుతం కలవర పడుతున్నారు. వైరస్ సోకడానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గురుకుల పాఠశాలలో కనీస వసతులు లేవని... అసలు కరోనా జాగ్రత్రలు పాటించడం లేదన్నారు. లక్షణాలున్నట్లు ముందుగా తోటి విద్యార్థులు తెలిపినా కూడా... అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా సోకిన వారికి స్పల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని... పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.