ఏదైనా కీలక నిర్ణయం తీసుకున్న సమయంలో జగన్ సలహా ఇస్తే మాత్రమే కొంత మంది మాట్లాడే పరిస్థితి ఉంటుందని జగన్ మాట్లాడమంటే మాత్రమే మీడియా ముందుకు వెళ్తారని లేకపోతే మాత్రం పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదని ఇటువంటి మంత్రుల విషయంలో జగన్ ని చూసి చూడనట్టుగా ఇన్ని రోజులు వెళ్లారని కానీ ఇకముందు మాత్రం అలా వెళితే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు రావచ్చని అంటున్నారు.
కొంతమంది ప్రభుత్వంలో అనుభవం ఉన్న మంత్రులు కూడా జగన్ కు సహకరించకపోవడంతో ప్రభుత్వంలో జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారని కొన్ని కీలక బిల్లు ప్రవేశపెట్టే సమయంలో కూడా చిన్నచిన్న సలహాలు ఇచ్చే పరిస్థితిలో కొంత మంది మంత్రులు లేరని అంటున్నారు. రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ మంత్రి వర్గాన్ని కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ ప్రక్షాళన చేయకపోతే మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో ఉన్న కొంత మంది మంత్రుల నుంచి సరైన సహకారం అందకే ఇన్ని ఇబ్బందులు వచ్చాయి అనే మాట కూడా వినపడుతోంది.