కడప జిల్లా ఖాజీపేట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 13 మంది సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో భూములు తాకట్టు పెట్టుకుని పనులు చేయించామని సర్పంచుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తామంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలులో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే కాకుండా... 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించినట్లు సర్పంచులు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధపడ్డట్లుగా పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఖాజీపేట మండలంలోని ఆయా పంచాయతీలలో... వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులను, శానిటేషన్ కార్యక్రమంతో పాటుగా తదితర నిర్వహణ భారాలను బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించారు. ఖాజీపేట మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉండగా 13 మంది సర్పంచులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తామంతా వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నామని.. అయితే ప్రభుత్వ విధానాల వల్లే పార్టీకి ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు. ఎనిమిది నెలలుగా గ్రామాల్లో రిపేరు చేసిన మోటార్ బిల్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఎటువంటి అభివృద్ధి చేయడానికి అవకాశం లేక ఆవేదనతో రాజీనామా చేసినట్లు లేఖలో ప్రస్తావించారు.
కడప జిల్లా ఖాజీపేట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 13 మంది సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో భూములు తాకట్టు పెట్టుకుని పనులు చేయించామని సర్పంచుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తామంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలులో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే కాకుండా... 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించినట్లు సర్పంచులు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధపడ్డట్లుగా పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఖాజీపేట మండలంలోని ఆయా పంచాయతీలలో... వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులను, శానిటేషన్ కార్యక్రమంతో పాటుగా తదితర నిర్వహణ భారాలను బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించారు. ఖాజీపేట మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉండగా 13 మంది సర్పంచులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తామంతా వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నామని.. అయితే ప్రభుత్వ విధానాల వల్లే పార్టీకి ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు. ఎనిమిది నెలలుగా గ్రామాల్లో రిపేరు చేసిన మోటార్ బిల్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఎటువంటి అభివృద్ధి చేయడానికి అవకాశం లేక ఆవేదనతో రాజీనామా చేసినట్లు లేఖలో ప్రస్తావించారు.