ఎన్టీఆర్ హయాంలో 1986 లో మండలిని వివిధ కారణాల వల్ల రద్దు చేశారు అని ఆయన గుర్తు చేసారు. 2006లో అప్పటి ప్రభుత్వం వైఎస్ ఆర్ తిరిగి మండలిని ఏర్పాటు చేశారు అని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోగా అవి వివిధ కారణాల్లో డిలే అయ్యాయి అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడినవారు ప్రజలకు సుప్రీం రిప్రజెంటేటివ్ లు అని ఆయన స్పష్టం చేసారు. ప్రజలకోసం మంచి నిర్ణయం, చట్టం తీసుకోవాలనుకున్నా, కాలాన్ని బట్టి సవరణ చేయాల్సి ఉంటుంది అని తెలిపారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా చట్టాలు చేయాల్సిన భాద్యత లోక్ సభ, అసెంబ్లీలకు ఉంటుంది అని పేర్కొన్నారు. వీటిపై మండలి పలు సూచనలు చేయాల్సి ఉంటుంది అని ఆయన వివరించారు. అసెంబ్లీలో డాక్టర్లు, లాయర్లు తో పాటు అన్నివర్గాల మేధావులు వ ఎంతో మంది వున్నారు అని దీనితో మండలి రద్దు పై జనవరి 27, 2020 న మండలి రద్దు తీర్మానం చేసి పంపాము అని అన్నారు. అయితే అనేక కారణాలతో అది డిలే అయింది అని పేర్కొన్నారు. దీనితో మండలి ముందుకు వెళ్లాలా వద్ద అనే సందిద్దత ఏర్పడింది అనివివరించారు. చివరకు మండలి కొనసాగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు అన్నారు.