పెట్రో ధరల కారణంగా నిత్యావసర వస్తువులు కూడా భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా, జపాన్ సహా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో కలిపి ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర నిల్వ నుంచి దేశ అవసరాల కోసం దాదాపు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విడుదల చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరంలో మొత్తం మూడు ప్రదేశాల్లో భూగర్భ గుహల్లో సుమారు 38 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు కేంద్ర నిల్వ చేసింది. వీటిలో విశాఖపట్నంలో కూడా దాదాపు 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ప్రస్తుతం నిల్వ ఉంది. ఇందులో దాదాపు 5 మిలియన్ బ్యారెళ్లను వారం నుంచి పది రోజుల్లో విడుదల చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ముడిచమురును మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ సంస్థలకు కేంద్రం విక్రయిస్తుంది. అత్యవసర నిల్వలు విడుదల చేయడం ద్వారా చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వెల్లడించారు.
పెట్రో ధరల కారణంగా నిత్యావసర వస్తువులు కూడా భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా, జపాన్ సహా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో కలిపి ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర నిల్వ నుంచి దేశ అవసరాల కోసం దాదాపు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విడుదల చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరంలో మొత్తం మూడు ప్రదేశాల్లో భూగర్భ గుహల్లో సుమారు 38 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు కేంద్ర నిల్వ చేసింది. వీటిలో విశాఖపట్నంలో కూడా దాదాపు 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ప్రస్తుతం నిల్వ ఉంది. ఇందులో దాదాపు 5 మిలియన్ బ్యారెళ్లను వారం నుంచి పది రోజుల్లో విడుదల చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ముడిచమురును మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ సంస్థలకు కేంద్రం విక్రయిస్తుంది. అత్యవసర నిల్వలు విడుదల చేయడం ద్వారా చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వెల్లడించారు.