పార్టీలో ఉన్న చాలామంది నాయకులు సోము వీర్రాజు లెక్క చేయడం లేదని ఏ జిల్లాకు ఆ జిల్లాలో పార్టీలో వర్గాలు ఎక్కువగా ఉన్నాయని దీంతో చాలామంది నాయకులు సోము వీర్రాజు నీ లెక్క చేయడం లేదని అంటున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో సోము వీర్రాజు మాట వినే వాళ్ళ కంటే కూడా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట వినే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని అదే విధంగా కొంతమంది కీలక నాయకులు కూడా తెలుగుదేశం సహా కొన్ని పక్షాలతో ఎక్కువగా స్నేహం చేస్తున్నారని బిజెపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీలో ఉన్న నాయకులను ఏకతాటి మీదకు తీసుకొచ్చే విషయంలో గానీ అలాగే ప్రజా ఉద్యమాలు నిర్వహించే విషయంలో గానీ సోము వీర్రాజు సరిగా వ్యవహరించలేదు. ఇక పార్టీలో తన మాట వినని వాళ్ళు మరో ఆలోచన లేకుండా సస్పెండ్ చేయడం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వెనక్కు తగ్గుతుందనేది అంశాలు. సోము వీర్రాజు ఇదే తరహాలో ముందుకు వెళితే మాత్రం పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఇతర పార్టీల వైపు చూడవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.